యుక్రెయిన్ పర్యటనలో ప్రధాని మోదీ.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న జెలెన్ స్కీ

1991లో సోవియట్ నుంచి విడిపోయి యుక్రెయిన్ ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.

Modi Zelensky Meet : యుక్రెయిన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ అయ్యారు. మోదీకి స్వాగతం పలికిన జెలెన్ స్కీ.. ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. యుక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ ఏ పక్షం వహించదని, కేవలం శాంతికి మాత్రమే వారధిగా పని చేస్తుందని సందేశమిచ్చేందుకు ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టారు. 1991లో సోవియట్ నుంచి విడిపోయి యుక్రెయిన్ ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.

 

ట్రెండింగ్ వార్తలు