Arrest
RSF Report : 2021లో ప్రపంచవ్యాప్తంగా 488 మంది జర్నలిస్టులను అరెస్టు చేయబడగా,46 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(RSF) అనే ఎన్జీవో సంస్థ వెల్లడించింది. గడిచిన 25 ఏళ్ల నుంచి జర్నలిస్టుల డేటాను ఆర్ఎస్ఎఫ్ లెక్కిస్తోంది. అయితే గత 25 సంవత్సరాల నుండి జరల్నిస్టుల అరెస్ట్లు లెక్కింపు ప్రారంభించినప్పటి నుండి.. ఈ ఏడాదే అత్యధిక మంది జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారని ఆర్ఎస్ఎఫ్ వెల్లడించింది.
1995లో ఆర్ఎస్ఎఫ్ వార్షిక రౌండ్-అప్ను ప్రచురించడం ప్రారంభించినప్పటి నుంచి వారి పనికి సంబంధించి నిర్బంధించబడిన జర్నలిస్టుల సంఖ్య ఇంత ఎక్కువగా లేదు అని ఆర్ఎస్ఎఫ్ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే.. అరెస్టులు 20 శాతం పెరిగాయని తెలిపింది.
మయన్మార్, బెలారస్, హాంకాంగ్లలో మీడియాపై అణిచివేతలు ఎక్కువ అయ్యాయని పేర్కొంది. ఈసారి మహిళా జర్నలిస్టులను అరెస్టు చేసిన సంఖ్య కూడా పెరిగింది. 2020 కంటే ఎక్కువ మంది మహిళా జర్నలిస్టులు ఈ సంవత్సరం అరెస్ట్ అయ్యారని ఆర్ఎస్ఎఫ్ తెలిపింది. సుమారు 60 మంది మహిళా జర్నలిస్టులు ఈ ఏడాది అరెస్టు అయ్యారు.
ఇక,మొత్తంగా ఈ ఏడాది అత్యధికంగా చైనాలో 127 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. మయన్మార్లో 53, వియత్నాంలో 43,బెలారస్ 32, సౌదీ అరేబియా 31 మంది జర్నలిస్టుల అరెస్ట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మరోవైపు, మధ్య ప్రాచ్య దేశాల్లో సంఘర్షణలు తగ్గు ముఖం పట్టడం కారణంగానే జర్నలిస్ట్ ల హత్యల సంఖ్య తగ్గినట్లు ఆర్ఎస్ఎఫ్ చెబుతోంది. సిరియా, ఇరాక్, యెమెన్లలో యుద్ధ వాతావరణం మారుతుండటంతో జర్నలిస్టుల హత్యలు తగ్గాయి. ఈ ఏడాది జరిగిన 46 హత్యలలో ఎక్కువ భాగం హత్యలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని చేయబడ్డాయని అని నివేదిక పేర్కొంది. మెక్సికోలో ఏడు, అఫ్ఘానిస్తాన్లో ఆరుగురు జర్నలిస్టులను చంపేశారు. యెమెన్, ఇండియాలో నలుగురేసి జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా బందీలుగా ఉన్న 65 మంది జర్నలిస్టులు, సహచరులను కూడా ఆర్ఎస్ఎఫ్ లెక్కించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి..సిరియాలో (44), ఇరాక్ లో (11),యెమెన్ లో (9)జర్నలిస్ట్ లు బందీలుగా ఉన్నారు.
ALSO READ V-Sat 2022 : విజ్ఞాన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రోగ్రామ్స్ లో ప్రవేశానికి వీ-శాట్ నోటిఫికేషన్