Russia is recruiting thieves and killers to fight war against Ukraine
Russia-Ukraine war : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి దాదాపు 8 నెలలు అవుతోంది. అయినా యుక్రెయిన్ పోరాడుతునే ఉంది. రష్యా వెనక్కి తగ్గకపోయినా సైనికులను మాత్రం భారీగానే కోల్పోయింది. యుక్రెయిన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అయినా ఏమాత్రం తగ్గటంలేదు. ఐరోపా దేశాల మద్దతుతో ఉక్రెయిన్ సైతం దీటుగా బదులిస్తోంది. కానీ రష్యాకు సైనికుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా దొంగలను..హంతకులను సైన్యంలోకి తీసుకుంటోంది. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఇంటర్వ్యూలు చేసి ఆర్మీలో నియమించుకుంటోంది. ఈ విషయాన్ని ‘ది గార్డియన్’ కథనాన్ని వెలువరించింది.
ఇరు వైపులా చాలా ప్రాణ నష్టం జరిగినా రష్యా వెనక్కు తగ్గడం లేదు. ఐరోపా దేశాల మద్దతుతో యుక్రెయిన్ సైతం ధీటుగా బదులిస్తోంది. తీవ్ర సైనికుల కొరతతో ఉన్న రష్యా ప్రభుత్వం నేరాలు చేసి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఆర్మీలోకి చేర్చుకునేందుకు ఇంటర్వ్యూలు చేసి నియమించుకుంటోంది. సైనిక కొరతను పెంచుకోవటానికి రష్యా ఖైదీలను తమ సైన్యంలో చేర్చుకుంటోందని ‘ది గార్డియన్’ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. ది గార్డియన్ కథనం ప్రకారం ఆరు నెలలు యుద్ధభూమిలో పని చేస్తే శాశ్వతంగా జైలు నుంచి విముక్తి చేస్తామన్న ఖైదీలకు రష్యా ప్రభుత్వం వాగ్దానం చేస్తోంది. అలా దొంగలు, హంతకులను రిక్రూట్ చేసుకుంటోందని పేర్కొంది.
ఇదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహిత మిత్రుడు..వాగ్నర్ గ్రూప్ అధిపతి యవ్జెనీ ప్రిగోజిన్ తన బృందానికి చెబుతున్నట్టుగా ఉన్న ఓ వీడియో రష్యా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఇది నిజమనిపిస్తోంది. ఈ వార్తలను మాత్రం ప్రిగోజిన్ కొట్టిపారేస్తున్నారు. రష్యాకు అంత అవసరం లేదంటూ ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. కానీ ఈ వార్తలు నిజమేనని ఖైదీలను సైన్యంలో చేర్చుకుంటున్నారని పలువురు ధ్రువీకరిస్తున్నారు. ‘ఆరు నెలలు యుద్ధంలో పాల్గొని పోరాడితే మేం జీవితాంతం స్వేచ్ఛగా ఉంటాం అని ప్రిగోజిన్ మాకు హామీ ఇచ్చారని.. కానీ కొద్దిమంది మాత్రం తిరిగి జైలుకు వస్తారని తమకు ఆఫర్ ఇచ్చారని మాస్కోకు సమీపంలో ఉన్న ఓ జైలులో ఖైదీగా ఉన్న ఇవాన్ అనే వ్యక్తి ‘ది గార్డియన్’కు వెల్లడించాడట. రష్యా రాజధాని మాస్కోకు దక్షిణంగా 300 మైళ్ల దూరంలో ఉన్న జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ తమకు ఈ వివరాలు తెలిపాడని ది గార్డియన్ అంటోంది.
ఈ ప్రతిపాదనకు సుమారు 120 మంది ఖైదీలు అంగీకరించారని..వాళ్లంతా ఒకవారం ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న తరువాత యుక్రెయిన్ యుద్ధంలో పోరాడుతున్నారని తెలిపాడు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆఫర్ ను నేను తిరస్కరించానని ..ప్రిగోజిన్ మళ్లీ తనను సంప్రదిస్తే నేను కూడా ఆర్మీలో చేరుతానని చెప్పుకొచ్చాడట సరదు ఖైదీ. దానికి సదరు ఖైదీ ఓ కారణం కూడా చెప్పాడట..తాను ఇంకా 11 సంవత్సరాలు జైలులో గడపాలి. ఈ లోపే నేను నా ప్రాణాలు పోతానేమో..అదే యుద్ధంలో పాల్గొంటే ఒకవేళ విడుదల కావచ్చేననే ఆశ ఉంది. ఒకవేళ తాను ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ను వినియోగించుకుని యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటే ఒకవేళ ఆయుద్ధంలోంచి ప్రాణాలతో బయటపడితే తాను స్వతంత్ర్యంగా జీవించవచ్చు కదా..అలా జరగకపోతే తాను జైలులో చనిపోయినా..యుద్ధంలో చనిపోయినా పెద్ద తేడా ఉండదు కదా? అందుకే తనతో ప్రిగోజిన్ మరోసారి సంప్రదిస్తే తాను యుద్ధంలో పాల్గొనటానికి అంగీకరిస్తానని చెప్పాడని ది గార్డినర్ పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ అంగీకరిస్తే కనీసం నా స్వాతంత్ర్యం కోసం పోరాడే అవకాశం నాకు లభిస్తుంది కదా..అని చెప్పుకొచ్చాడట సదరు ఖైదీ..సైన్యంలో చేరడం కోసం ఇంటర్వ్యూ చేసిన తమకు ఆరు నెలల తర్వాత అధ్యక్షుడి క్షమాభిక్ష, నెలకు లక్ష రూబిల్స్ జీతం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని వెల్లడించారు. ‘ఇది నిజం. మేము దొంగలం, హంతకులం. ఇప్పుడు రష్యా కోసం యుద్ధంలో పోరాడుతున్నాము’ అని ఇవాన్ అనే ఖైదీ ‘ది గార్డియన్’కు తెలిపారు.