COVID-19 Relief India : భారత్కు 500 మిలియన్ డాలర్ల సాయం చేసిన అమెరికా
కరోనా సెకండ్ వేవ్తో అల్లాడిపోతున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. అమెరికా కూడా భారత్కు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటి వరకు భారతదేశానికి 500 మిలియన్ డాలర్ల సాయం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది.
- Sreehari A
- Published On : May 20, 2021 / 01:18 PM IST
Us Provided $500 Million In Covid 19 Relief To India So Far White House (1)
COVID-19 Relief to India : కరోనా సెకండ్ వేవ్తో అల్లాడిపోతున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. అమెరికా కూడా భారత్కు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటి వరకు భారతదేశానికి 500 మిలియన్ డాలర్ల సాయం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిణీ చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. భారత్కు 500 మిలియన్ డాలర్ల కొవిడ్ సాయాన్ని అమెరికా ప్రభుత్వం అందించింది.
కోవిడ్ మహమ్మారి ప్రభావంతో బాధపడుతున్న ఇతర దక్షిణాసియా దేశాలకు కూడా ఆ సహాయాన్ని అందించడానికి బైడెన్ యంత్రాంగం ఇప్పుడు కృషి చేస్తోందని జెన్ సాకి వైట్ తెలిపారు. దీనిలో భాగంగా 80 కోట్ల వ్యాక్సిన్లను అందించాలని భావిస్తున్నాం. వీటిలో 60 కోట్ల ఆస్ట్రాజెనికా టీకాలు, మరో మూడు వ్యాక్సిన్లు 20 కోట్ల డోసులు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అన్నారు.
COVID-19 మహమ్మారి ప్రభావంతో అల్లాడిపోతున్న దక్షిణాసియా దేశాలకు సహాయాన్ని అందించడానికి బైడెన్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఆక్సిజన్ సరఫరాతోపాటు 95 మాస్క్లు, ఇతర ఔషధాలను పంపించామని తెలిపారు. 80 మిలియన్ మోతాదుల (COVID-19 వ్యాక్సిన్ల) పరంగా 60 మిలియన్ల ఆస్ట్రాజెనెకా, ఇతర మూడు ఆమోదించిన వ్యాక్సిన్లపై అందించనున్నట్టు పేర్కొన్నారు.
