Meta : యువతను చెడగొడుతున్నాయి.. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థపై 40 రాష్ట్రాలు దావా

మెటా తమ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో గడిపే సమయాన్ని పెంచడానికి వ్యాపార నమూనాలను రూపొందించడం ద్వారా మెటా యువతను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు

Mata

US States Sue Meta: : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటాపై యూఎస్ కు చెందిన 40 రాష్ట్రాలు కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో దావా వేశాయి. ఈ దావాలో మెటా తన ఆర్థిక లాభాలను పెంచుకోవడానికి తన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో గణనీయమైన ప్రమాదాల గురించి ప్రజలను పదేపదే తప్పుదోవ పట్టిస్తోందని రాష్ట్రాలు ఆరోపించాయి. పిల్లలు, యుక్తవయసుల వారు అత్యధిక శాతం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని, దానికి మెటా వంటి సోషల్ మీడియా కంపెనీలే కారణమని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ దవాను ప్రకటిస్తూ ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read : Xiaomi 12 Pro 5G Price : క్రోమాలో షావోమీ 12 ప్రో 5G ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

మెటా తమ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో గడిపే సమయాన్ని పెంచడానికి వ్యాపార నమూనాలను రూపొందించడం ద్వారా మెటా యువతను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. దీని ద్వారా పిల్లలు, యువకులు వాటికి వ్యసనపరులుగామారి అధిక స్థాయిలో మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నారని దావాలో పేర్కొన్నారు. మెటా టెక్నాలజీ చీఫ్ టెక్ టైటాన్ దృష్టిలో భాగమైన హారిజన్ వరల్డ్ వర్చువల్ రియాలిటీ ఆఫర్ తో సహా, మెటా తన ప్లాట్ ఫారమ్ ల భద్రత గురించి ప్రజలను తప్పుదారి పట్టించిందని దావాలో పేర్కొన్నారు.

Also Read : Google Discover Tab : గూగుల్ డిస్కవర్ ఫీడ్‌లో కొత్త AQI ఫీచర్.. మీ సిటీలో ఎయిర్ క్వాలిటీ చెక్ చేయొచ్చు..!

విషపూరిత కంటెంట్ కోసం రూపొందించబడిన అల్గారిథమ్ లను ఉపయోగిస్తున్నట్లు, వాటిని వినియోగించే దిశగా పిల్లలు, యువతను నెట్టివేసే మెటా ప్లాట్ పారమ్ ల వల్ల వ్యసన లక్షణాలకు వ్యతిరేకంగా పిర్యాదులు కూడా ఉన్నాయి. అంతేకాక యువతను ఎక్కువ సమయం తమ ప్లాట్ పారమ్ లలో గడిపేందుకు మెటా శక్తివంతమైన, అపూర్వమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుందని దావాలో ఆయా రాష్ట్రాలు పేర్కొన్నాయి.