ఇథియోపియా ఎయిర్లైన్కు చెందిన బోయింగ్ 737 పాసింజర్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి వెళ్తున్న విమానం ప్రమాదానికి గురై మొత్తం 149 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది విమాన సిబ్బంది చనిపోయారు. ఈ ఘటనలో నలుగురు భారతీయులు ఉండగా ఒకరిని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన తెలుగు యువతి కూడా అందులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
గుంటూరుకు చెందిన నూకవరపు మనీషాగా యువతిని అధికారులు గుర్తించారు. గుంటూరు వైద్య కళాశాలలో ఎమ్బీబీఎస్ పూర్తి చేసిన మనీషా అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడింది. నైరోబిలోని తన అక్కను చూడడానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మనీషా మృతితో ఉంగుటూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా విమానంలో 33దేశాలవాళ్లు ఉన్నట్లు ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది.