IPL 2021 : సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్.. ఫైనల్ ఎప్పుడంటే?

2021లో కరోనా ప్రభావంతో మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ సీజన్ మళ్లీ మొదలుకానుంది. వచ్చే సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు మొదలు కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Ipl To Resume On September 19 Final On October 15

IPL 2021 Season : 2021లో కరోనా ప్రభావంతో మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ సీజన్ మళ్లీ మొదలుకానుంది. వచ్చే సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు మొదలు కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. మిగతా ఐపీఎల్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనున్నాయి.

దుబాయ్, షార్జా, అబు ధాబిలో మిగిలిన మ్యాచ్ లను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లను యూఏఈలో సెప్టెంబర్-అక్టోబర్ నెలలో పున:ప్రారంభించే అవకాశం ఉందని బీసీసీఐ ప్రకటించింది.

వచ్చేది వర్షకాలం కావడంతో ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లను ఇండియా బయట టోర్నమెంట్ నిర్వహించాలని భావించింది. కరోనాతో ఒక్కొక్కరుగా ఆటగాళ్లు దూరం కావడంతో ఐపీఎల్ టోర్నీ మధ్యలోనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్ 15న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

ట్రెండింగ్ వార్తలు