ఆనాటి ‘మిస్ ఇండియా’ సుందరీమణుల ఫొటోలు చూశారా?

  • Publish Date - May 15, 2020 / 10:11 AM IST

బిజీబిజీగా లైఫ్ గడిపేసిన వారంతా లాక్‌డౌన్ పుణ్యామని ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ తమ ఇంట్లోనే ఉంటూ ఒకప్పటి మెమెరీలను గుర్తుచేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఒకప్పటి తీపి గుర్తులను తమ కుటుంబ సభ్యులతో పాటు తమ అభిమానులతోనూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఒకప్పుడు ప్రపంచ సుందరిగా పేరొందిన మిస్ యూనివర్స్ లారా దత్తా తన 20ఏళ్ల నాటి మిస్ యూనివర్స్ కిరీటీం దక్కించుకున్న నాటి పాత ఫొటోలు, ఫ్యాన్ పేజీల్లో షేర్ చేసింది. లారా షేర్ చేసిన పాత ఫొటోల్లో ఒక ఫొటో ప్రతిఒక్కరిని ఫిదా చేస్తోంది. ఆ ఫొటోలో లారా స్విమ్ స్యూట్ రౌండ్ లో పాల్గొని తన అందాలతో ఫొజిస్తూ ప్రతిష్టాత్మకమైన కిరీటాన్ని గెల్చుకుంది. 

ఆ ఫొటోలో లారా దత్తాతో పాటు మొత్తం 8 మంది మిస్ ఇండియా అందాల సుందరిమణులు కూడా తళుకుమని మెరిశారు. ఆ ఫొటోలో మిస్ యూనివర్స్ (1994) సుస్మితా సేన్, మిస్ వరల్డ్ (1994), ఐశ్వర్యా రాయ్, మిస్ వరల్డ్ (199), డయానా హేడెన్, మిస్ వరల్డ్ (1999), యుక్తా మోఖే, మిస్ యూనివర్స్ (2000), లారా, మిస్ వరల్డ్ (2000), ప్రియాంకా చోప్రా, మిస్ ఆసియా పసిఫిక్ (2000) డియా మిర్జా తదితరులు ఉన్నారు. 

మరో బాలీవుడు భామ సోనమ్ కపూర్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీల్లో ఫొటోను షేర్ చేసింది. ‘నేనెప్పుడూ ఇలాంటి దృశ్యాన్ని చూడలేదు. ఈ మహిళలు చరిత్రను సృష్టించారు. ఇలాంటి మరుపురాని క్షణం మళ్లీ జరుగుతుందని అనుకోం. భారత్ ఒక నిజమైన శక్తి కేంద్రం’ అని పోస్టు చేసింది.

సుస్మితా సేన్ తర్వాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న రెండో భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. 2003లో ఫిల్మ్ అండాజ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి లారా ఎంట్రీ ఇచ్చింది. అంతర్జాతీయ బ్యూటీ కాంటెస్టుల్లో పాల్గొనే మోడల్స్ కోసం లారా దత్తా మెంటర్ గా కూడా వ్యవహిరించారు. 

Read Here>> భార్యను వదిలేసి, యువ గాయనితో మ్యూజిక్ డైరెక్టర్ సహజీవనం

ట్రెండింగ్ వార్తలు