జులై-10నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలు…6పేపర్లు మాత్రమే

10వ తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ దృష్ట్యా ఆరు రోజుల్లోనే పరీక్షలు పూర్తయ్యేలా షెడ్యూల్ ప్రకటించింది. 10వ తరగతి ఎగ్జామ్ పేపర్లను 11 నుంచి 6పేపర్లకు కుదించింది. జులై-10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు జరుగనున్నట్లు తెలిపింది. 

జులై-10న ఫస్ట్ లాంగ్వేజ్,11న సెకండ్ లాంగ్వేజ్,12న ఇంగ్లీష్, 13న మ్యాథ్స్,14న సైన్స్,15న సోషల్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నాం 12:45గంటల వరకు పరీక్ష ఉంటుంది. భౌతిక దూరం పాటిస్తూ ఎగ్జామ్స్ నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు ఆలస్యమైన విషయం తెలిసిందే.

Read Here>> 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఏపీ ప్రభుత్వం జీవో