Shiv Sena: శివసేన పార్టీని అంతం చేసేందుకు కుట్ర: ఉద్ధ‌వ్ ఠాక్రే

''సంజ‌య్ రౌత్ ఇంటి వ‌ద్ద ఈడీ అతిథులు ఉన్నారు. ఇదేం కుట్ర? హిందువుల‌కు, మ‌రాఠీ ప్ర‌జ‌ల‌కు శివ‌సేన బ‌లాన్ని ఇస్తుంది. దీంతో పార్టీని అంతం చేసేందుకు కుట్ర జ‌రుగుతోంది. రెబ‌ల్ క్యాంప్‌లో చేరిన మాజీ మంత్రి అర్జున్ ఖొత్తార్ ఓ విష‌యాన్ని అంగీక‌రించారు. త‌న‌ను ఒత్తిడి చేయ‌డంతోనే రెబ‌ల్ క్యాంపులో చేరాన‌ని అన్నారు'' అని ఉద్ధ‌వ్ ఠాక్రే చెప్పారు.

Shiv Sena: శివసేన పార్టీని అంతం చేసేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే అన్నారు. శివ‌సేన సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ముంబైలోని ఓ భ‌వ‌న స‌ముదాయ పున‌ర్నిర్మాణ ప‌నులకు సంబంధించిన మ‌నీలాండ‌రింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ విచార‌ణ జ‌రుపుతోంది. న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ నిరోధ‌క చ‌ట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయ‌నను ద‌క్షిణ ముంబైలోని ఈడీ కార్యాల‌యంలో విచారిస్తోంది.

మ‌రోవైపు, ఏప్రిల్‌లో సంజ‌య్ రౌత్ భార్య వ‌ర్ష రౌత్‌తో పాటు ఆయ‌న ఇద్ద‌రు అనుచ‌రుల‌కు సంబంధించిన రూ.11.15 కోట్ల ఆస్తుల‌ను అటాచ్ చేసింది. ఈ నేప‌థ్యంలో, ఇవాళ సంజ‌య్ రౌత్‌ను అరెస్టు చేయ‌డంపై ఉద్ధ‌వ్ ఠాక్రే మాట్లాడుతూ.. ”సంజ‌య్ రౌత్ ఇంటి వ‌ద్ద ఈడీ అతిథులు ఉన్నారు. ఇదేం కుట్ర? హిందువుల‌కు, మ‌రాఠీ ప్ర‌జ‌ల‌కు శివ‌సేన బ‌లాన్ని ఇస్తుంది. దీంతో పార్టీని అంతం చేసేందుకు కుట్ర జ‌రుగుతోంది. రెబ‌ల్ క్యాంప్‌లో చేరిన మాజీ మంత్రి అర్జున్ ఖొత్తార్ ఓ విష‌యాన్ని అంగీక‌రించారు. త‌న‌ను ఒత్తిడి చేయ‌డంతోనే రెబ‌ల్ క్యాంపులో చేరాన‌ని అన్నారు” అని చెప్పారు.

Maharashtra: శివసేన ఎవ‌రిది?.. త‌న‌దేనంటూ ఈ వాద‌న‌లు వినిపించిన సీఎం ఏక్‌నాథ్ షిండే

ట్రెండింగ్ వార్తలు