తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. నేతలను కూడా వదలడం లేదు. పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది నేతలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
తాజాగా ప్రగతి భవన్ లో పనిచేసే సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో కలకలం రేపుతోంది. 2020, జులై 03వ తేదీ గురువారం నలుగురు సిబ్బందికి వైరస్ ఉందని తేలింది. వీరే కాకుండా..ప్రగతి భవన్ లో పనిచేసే మరికొంతమందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 30 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు.
కొంతమందికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా..మరికొంతమందికి హోం క్వారంటైన్ లో ఉంచారు. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ఉందని తేలడంతో..అధికారులు, వైద్య సిబ్బంది ప్రగతి భవన్ ను శానిటైజ్ చేశారు.
తెలంగాణలో కరోనాతో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధానంగా ghmc పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ ను మరింత వ్యాప్తి చెందకుండా కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేయడం, తదితర చర్యలు తీసుకున్నా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. మరోవైపు సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.
Read:తల్లి ఫేస్ బుక్ ప్రియులు బిడ్డ ప్రాణాలు తీశారు..వివాహేతర సంబంధమే కారణమా?