Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. తెహ్రీకి 78 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
భూ అంతర్భాగంలో 5 కి.మీ లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కూడా భూమి స్వల్పంగా కంపించింది.
Earthquake In Arunachal Pradesh : అరుణాచల్ప్రదేశ్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 3.7 తీవ్రత నమోదు
గత నెలలో ఉత్తరాఖండ్లో రెండు సార్లు భూకంపం సంభవించింది. అక్టోబర్ 8న 3.9 తీవ్రతతో మున్సియారీలో భూమి కంపించింది. అక్టోబర్ 2న 2.5 తీవ్రతతో ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు సంభవించాయి.