Red Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అనేక రాష్ట్రాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో బుధవారం వరకు ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్లలో కురుస్తున్నవర్షాల కారణంగా వరద ముప్పు పెరిగిపోయింది. రోడ్లు జలమయమై, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి.
Kerala : మెడికల్ కాలేజీ క్లాస్ రూంలో విద్యార్ధిని, విద్యార్ధులకు మధ్య కర్టెన్..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయి. ఒడిశాతోపాటు పశ్చిమ మధ్యప్రదేశ్, కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. పశ్చిమ రాజస్థాన్లో సోమవారం, తూర్పు ప్రాంతంలో సోమవారం నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని అనేక ప్రాంతాలకు సోమవారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తర, దక్షిణ కర్ణాటక, ఉడుపి, సతారా, పూణె, రాయ్గఢ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, వస్లాడ్, నవసారి, గిర్, సోమ్నాథ్, జునాగఢ్లకు రాబోయే రెండు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.