కరోనా మహమ్మారి కాలంలో ఇద్దరు ముగ్గురు కలిసి ఒకేచోట ఉండటానికే ప్రజలు హడలిపోతున్నారు. సొంత బంధువులు చనిపోతేనే వెళ్లటం లేదు. కానీ..కరోనా నిబంధలను ఏమాత్రంఖాతరు చేయకుండా ..అసోంలోని నాగావ్ జిల్లాలో ఓ మతబోధకుడి అంత్యక్రియలకు ఏకంగా 10 వేల మంది హాజరు కావడం కలకలం రేపింది.
ఈ అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను ఇస్లాం కుమారుడు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన అమీనుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే మూడు గ్రామాల్లో లాక్డౌన్ విధించారు. మరోవైపు, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 10వేలకు చేరుకుంది.
Read Here>>కరోనాతో చనిపోయిన నాయకుడి మృతదేహం కోసం పోలీసుల్ని కిడ్నాప్ చేసిన గిరిజనులు