భగ్గుమంటున్న సూర్యుడు : ఐదు రాష్ట్రాల్లో Red Alert

  • Publish Date - May 25, 2020 / 08:39 AM IST

దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఉత్తరభారతంలో ఎండలు మరీ తీవ్రంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. మండు టెండలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాజస్థాన్‌లోని చురు జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చంఢీఘర్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది.

వేడి తీవ్రత అధికంగా ఉండటంతో ఈ ఐదు రాష్ట్రాల్లో రెండు రోజుల కోసం వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 9 రాష్ట్రాల్లోనూ ఐదు రోజుల పాటు తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశా, యూపీ, గుజరాత్ రాష్ట్రాలపై వడగాలుల ప్రభావం ఉంటుందని.. ఉత్తరాది రాష్ట్రాల మీదుగా వీచే గాలులతో దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ ఏడాది మొదటిసారి వాతావరణ శాఖ ఎండ తీవ్రతలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఎండలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని, ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ముఖ్యంగా అవసరం అయితేనే బయటకు రావాలని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వడ గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఇటు యూపీలో కూడా ఆరెంజ్  అలర్ట్ ను జారీ చేసింది. 

ఉత్తరభారత దేశంతోపాటు దక్షిణ భారతదేశం, మధ్యభారత దేశం మీదుగా వీచే వడ గాలులు ముఖ్యంగా వచ్చే ఐదు రోజులపాటు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. రాజస్థాన్, చంఢీఘర్, ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణలో కూడా వడగాలులు ప్రభావం అధికంగా ఉంటుందని, 40 డిగ్రీల ఉష్ణోగ్రతపైన ఎండ తీవ్రత ఉండటంతోపాటు వడగాలుల తీవ్రతతో వడదెబ్బ తగిలే అవకాశముంది కాబట్టి ప్రజలు అప్రమత్తం  ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

చత్తీస్ ఘడ్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ, కర్నాటకలో వచ్చే మూడు నాలుగు రోజులపాటు వడగాలుల ప్రభావం 40 డిగ్రీల ఉష్ణోగ్రతోపాటు ఇక్కడ కూడా ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య భారతంలో ముఖ్యంగా మరోరకమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరభారతదేశం, దక్షిణ భారతదేశంలో ఎండల తీవ్రత ఉంటే ఈశాన్య భారతంలో మాత్రం  రెండు, మూడు రోజుల్లో నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Read: ఏం ఎండలు రా బాబు..ఏపీలో మరో నాలుగు రోజులు ఇంతే

ట్రెండింగ్ వార్తలు