COVID 19 : తెలంగాణలో కరోనా…24 గంటల్లో 3 వేల 762 కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,762 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 20 మంది చనిపోయారు. మొత్తంగా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 3 వేల 189 కు చేరుకుంది.
- madhu
- Published On : May 26, 2021 / 07:28 PM IST
Media Bulletin On Status Of Positive Cases Covid 19 In Telangana 14
COVID 19 In Telangana : తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,762 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 20 మంది చనిపోయారు. మొత్తంగా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 3 వేల 189 కు చేరుకుంది. వైరస్ బారినపడిన వారిలో మరో 3, 816 మంది చికిత్స నుంచి కోలుకున్నారు. 5 లక్షల 22 వేల 082 మంది కోలుకున్నట్లైంది. మొత్తం పాజిటివ్ కేసులు 5,63,903కు పెరిగాయి.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు :
ఆదిలాబాద్ 08. భద్రాద్రి కొత్తగూడెం 128. జీహెచ్ఎంసీ 528. జగిత్యాల 70. జనగామ 45. జయశంకర్ భూపాలపల్లి 51. జోగులాంబ గద్వాల 73. కామారెడ్డి 26. కరీంనగర్ 170. ఖమ్మం 214. కొమరం భీం ఆసిఫాబాద్ 24. మహబూబ్ నగర్ 158. మహబూబాబాద్ 158. మంచిర్యాల 103. మెదక్ 43.
మేడ్చల్ మల్కాజ్ గిరి 213. ములుగు 39. నాగర్ కర్నూలు 104. నల్గొండ 218. నారాయణపేట్ 25. నిర్మల్ 16. నిజామాబాద్ 45. పెద్దపల్లి 137. రాజన్న సిరిసిల్ల 56. రంగారెడ్డి 229. సంగారెడ్డి 90. సిద్ధిపేట 131. సూర్యాపేట 178. వికారాబాద్ 101. వనపర్తి 93. వరంగల్ రూరల్ 102. వరంగల్ అర్బన్ 158. యాదాద్రి భువనగిరి 45. మొత్తం 3762.
