Chiranjeevi – Nagarjuna: కింగ్ నాగార్జున కోసం మెగాస్టార్ చిరంజీవి మాంచి వంటకం చేసి పెట్టి ఆయన టెన్షన్ తగ్గించారు. వారి కిచెన్లోకి అడుగుపెట్టడం, ఆయన నాకోసం వంట చెయ్యడం.. చిరు సతీమణి శ్రీమతి సురేఖ తర్వాత అంతటి భాగ్యం నాకు దక్కింది అంటూ కింగ్ తన స్నేహితుణ్ణి పొగడ్తలతో ముంచెత్తారు. స్వతహా చిరు వంటకాలు బాగా చేస్తారు.. అందులోనూ నాన్ వెజ్ ఐటెమ్స్ అయితే తిన్న వాళ్లు అదుర్స్ అనాల్సిందే. లాక్డౌన్ టైంలో తల్లి అంజనా దేవి కోసం నాన్ వెజ్ వంటకం (చింతచిగురు, చేపలు) వండారు. తర్వాత దోశెలు వేశారు. ఆ పిక్స్, వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి.
నాగ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’.. పాండమిక్ తర్వాత, ఓటీటీ రిలీజ్ వంటి పలు పుకార్ల తర్వాత థియేటర్లలోకి వస్తున్న సినిమా కావడం, ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోననే ఆందోళన.. గత కొద్ది రోజులుగా కంటిన్యూస్గా ప్రమోషన్స్తో బిజీ బిజీ.. దీంతో రిలాక్సేషన్ కోసం ఫ్రెండ్ చిరు ఇంట్లో వాలిపోయారు నాగ్.
నాగార్జున టెన్షన్ పోగొట్టేందుకు చిరు సరదాగా ముచ్చటించి రుచికరమైన వంటకం చేసిపెట్టారు. ‘నా నెర్వస్ని, ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ టెన్షన్ని కూల్ చేసేందుకు మెగాస్టార్ స్వయంగా వండిన ఒక టేస్టీ ఫుడ్’.. అంటూ నాగ్ ఈ పిక్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోను చిరు సతీమణి సురేఖ తీశారని చెప్పారు. ‘వైల్డ్ డాగ్’ నేడు (ఏప్రిల్ 2) న ప్రేక్షకుల ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్ దక్కించుకుంది. చిరు-కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆచార్య’ మే 13 న విడుదల కానుంది.
A delicious dinner Cooked by the megastar himself to cool my nerves for #WildDog release tomorrow !! Thank you For a wonderful evening @KChiruTweets ? picture courtesy Surekha garu ? pic.twitter.com/86FO5aWI1Q
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 1, 2021