Corona Cases : దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కేరళలో మాత్రం
భారత్లో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.. గడిచిన 24 గంటల్లో 10,488 కేసులు నమోదయినట్లు పేర్కొంది.
- kunduru Vinod
- Updated on- November 21, 2021 / 11:57 AM IST
Corona Cases (2)
Corona Cases : భారత్లో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.. గడిచిన 24 గంటల్లో 10,488 కేసులు నమోదయినట్లు పేర్కొంది. ఇక ఇదే సమయంలో కరోనాతో 313 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,45,10,413 చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 4,65,662 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
చదవండి : Corona : ఏపీలో కొత్తగా 164 కరోనా కేసులు, ఒకరి మృతి
శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 12,329 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం దేశంలో 1,22,714 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికి పైగా కేరళ రాష్ట్రంలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఈ రాష్ట్రంలో ఐదువేల పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా 1,16,50,55,210 మంది టీకాలు తీసుకున్నారు.
