Home » Latest » Prime Minister Narendra Modi At The G20 Summit Photos
G20 Summit in Bali: జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ.. ఫొటోలు
G20 Summit in Bali: ఇండోనేషియా రాజధాని బాలిలో మూడురోజుల పాటు జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు దేశాల అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చలు జరిపారు. భారత సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి మోదీ, సునాక్ భేటీ అయ్యారు. పలు విషయాలపై వీరి మధ్యచర్చ జరిగింది. మరోవైపు జీ-20 దేశాల కూటమి అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోదీ స్వీకరించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రధాని బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ప్రధాని స్వీకరించారు. జి20 దేశాల అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగిన విషయమని ప్రధాని మోదీ అభివర్ణించారు.