Supreme Court GATE 2022
GATE 2022 : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2022 పరీక్షలను(గేట్ 2022) తాత్కాలికంగా వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. పరీక్ష ప్రారంభమవటనికి 48 గంటల ముందు పిటీషన్ ను విచారించటం విద్యార్ధులలో గందరగోళానికి దారితీస్తుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్, విక్రమ్ నాథ్ లతో కూడిని ధర్మాసనం పేర్కోంది.
కోవిడ్ కేసులు పెరుగుతున్నందున గేట్ -2022 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఫిబ్రవరి 2వ తేదీన పలువురు అభ్యర్ధులు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. గురువారం నాడు ఆపిటీషన్ విచారణ చేపట్టిన ధర్మాసనం పరీక్షలను వాయిదా వేయటం కుదరదని తెలిపింది. ప్రస్తుతం విద్యా సంస్ధలన్నీ తెరుచుకుంటున్నాయని… అకడమిక్ విషయాల్లో అధికారులే నిర్ణయం తీసుకోవాలి. అందులో న్యాయస్ధానాలు జోక్యం చేసుకోవడం ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు.
ఈ పరీక్షలకు 9 లక్షల మంది విద్యార్ధులు హజరవుతున్నట్లు తెలుస్తోందని… ఈసమంయలో విద్యార్ధుల భవిష్యత్తుతో మేము చెలగాటం ఆడదలచుకోలేదనిసుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కాగా గేట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5,6, 12,13 తేదీల్లో జరుగుతాయి.
రేపు జరిగే పరీక్షకు 9 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. దేశ వ్యాప్తంగా 200 సెంటర్లలో జరిగే ఈ పరీక్షలకు అడ్మిట్ కార్డులను కూడా పంపించారు. ఐతే పరీక్షకు ఎటువంటి కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేయలేదని పిటీషనర్లు పేర్కోన్నారు.
Also Read : Building Collapse : పూణేలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి
గేట్ అడ్మిట్ కార్డులను విద్యార్ధులు కర్ప్యూ పాస్ లుగానూ…మూవ్ మెంట్ పాస్ లుగా ఉపయోగించుకోవచ్చని ఖరగ్పూర్ ఐఐటీ అధికారికంగా ప్రకటించింది. గేట్ పరీక్ష రిక్రూట్ మెంట్ కమ్ అడ్మిషన్ టెస్ట్ రెండు స్లాట్లలో నిర్వహించబడుతుంది. మొదటి స్లాట్ ఉదయం గం. 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు…. తదుపరి స్లాట్ మధ్యాహ్నం గం.2-30 నుంచి సాయంత్రం గం.5-30 వరకు జరుగుతుంది.