West Bengal Election వెస్ట్ బెంగాల్లోని నందిగ్రామ్లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య ఉత్కంఠభరిత పోరు నడుస్తోంది.17 రౌండ్ల కౌంటింగ్లో.. 16 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి సువేందు 6 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. చివరి రౌండ్(17వ రౌండ్) కౌంటింగ్ కొనసాగుతోంది.
మొత్తంగా రాష్ట్రంలో తృణమూల్ ఇప్పటికే 44 చోట్ల గెలుపొందింది. మరో 160కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 90లోపు స్థానాలకే పరిమితమయ్యే సూచనలున్నాయి.