swarupananda saraswati: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర
విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
- Narender Thiru
- Published On : May 16, 2022 / 12:32 PM IST
Swarupananda Saraswati
swarupananda saraswati: విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తిరుమలలో భక్తుల రాకను చూస్తుంటే, సంతోషంగా ఉందని చెప్పారు. కరోనా మహమ్మారి రెండేళ్లపాటు ప్రపంచాన్ని పీడించిందని, కరోనా మహమ్మారి మళ్లీ ప్రజలను తాకకూడదని కోరుకున్నారు.
Kangana Ranaut : ధాకడ్ సినిమా విజయవంతం కావాలని.. శ్రీవారిని దర్శించుకున్న కంగనా రౌనత్
తిరుమలలో భక్తుల ముఖాలను గమనిస్తే, శ్రీవారి దర్శనంతో అందరూ సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బాగుండాలని, ప్రజలపై, రైతులపై శ్రీవారి దయ ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.
