2020, మే 25వ తేదీ సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. రెండు నెలల తర్వాత గగన విహారం చేస్తున్నాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్రారంభమైనట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఆయన ఎయిర్ పోర్టును సందర్శించారు. అక్కడున్న ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ప్రయాణీకుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, టచ్ చేయకుండా..సెన్సార్ లు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణాలు సాగించే ప్రతి ప్రయాణికుడి దగ్గర ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని, ఈ యాప్ ఉన్న వారినే లోపలికి అనుమతినిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని సెక్యూర్టీ పరంగా, ఆరోగ్య పరంగా ఎయిర్ పోర్టులో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పరీక్షల అనంతరమే అనుమతినిస్తున్నామని, ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల్ల క్వారంటైన్ అవసరం ఉండదన్నారు. 1600 మంది ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మంజూరైన 30 విమానాల్లో 15 శంషాబాద్ నుంచి బయలుదేరేవి కాగా…మరో 15 ఇక్కడకు చేరుకుంటాయి. ప్రయాణీకులు విమానానికి సంబంధించిన ఆధారాలను దగ్గ ఉంచుకోవాలన్నారు.
Read: విదేశాల నుంచి ఏపీకి వచ్చిన పలువురికి కరోనా