COVID19 cases in India
Telangana Covid News : తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అదే సమయంలో కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 30వేల 205 మందికి కరోనా పరీక్షలు చేయగా, 476 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 239 కేసులు వచ్చాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో 26 చొప్పున కేసులు నమోదవగా, కరీంనగర్ జిల్లాలో 22 కొత్త కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 984 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 28వేల 471 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 20వేల 597 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల 763కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 39వేల 413 కరోనా పరీక్షలు చేయగా, 612 మందికి పాజిటివ్ గా తేలింది.