జులై 7న నీట్ పీజీ పరీక్ష..
నీట్ పీజీ పరీక్ష జులై 7వ తేదీన జరగనుంది. మార్చి 3వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షను జులై 7వ తేదీకి రీ షెడ్యూల్ చేస్తున్నట్లు మెడికల్ సైన్సెస్ జాతీయ పరీక్ష బోర్డు (ఎన్బీఈఎంఎస్) ప్రకటించింది. ఈ పరీక్ష రాసే అర్హత కటాఫ్ తేదీని ఆగస్టు 15గా వెల్లడించింది. పీజీ వైద్యవిద్య నిబంధనలు -2023 ప్రకారం ఈ పరీక్ష జరగనుంది.