uk woman lies on railway crossing photos : యూకేలోని బ్రిటన్ లో ఫోటో షూట్ కోసం వచ్చిన ఓ మహిళ ఏకంగా లెవెల్ క్రాసింగ్ వద్ద ట్రాక్ పైన పడుకుంది. ఫొటో దిగేందుకు ట్రాక్పైనే పడుకుంది. రైళ్లు వస్తే పరిస్థితి ఏంటని కూడా ఆలోచించలేదు. చక్కగా వచ్చి ట్రాక్ పైన పడుకుంది. తాపీగా ట్రాక్పై పడుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. కెమెరా పట్టుకున్న ఫోటోలు తీసే వ్యక్తి కూడా ఆమెకు అది ప్రమాదం అని చెప్పలేదు. సరికదా తన ఫోటో ఫ్రేమ్ కరెక్ట్ చేసుకుని ఆమె పడుకోగానే ఫోటో క్లిక్ మనించారు.
ఈ దృశ్యం మొత్తం సీసీ కెమెరాలల్లో రికార్డ్ అయ్యింది. అది చూసిన బ్రిటన్ రైల్వే నెట్వర్క్ హెచ్చరికలు జారీ చేసింది. పలు సూచనలు చేసింది. కాగా రైల్వే క్రాసింగ్ వద్ద ఫొటోలు దిగిన ఆ మహిళ వీడియో కాసేపట్లోనే వైరల్గా మారింది. దీంతో ఆమె నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు. ఇంత నిర్లక్ష్యమా? వైరల్ కోసం మరీ ఇంత బాధ్యతలేకుండా బిహేవ్ చేస్తారా? అంటూ తిట్టిపోస్తున్నారు.
కాగా ప్రతీ చిన్న చిన్న సందర్భాలకు కూడా ఫోటో షూట్ సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ ఫోటో షూట్ కు ఏ లెవెల్ కు వెళ్లాయంటే.. అడ్వంచర్లు కూడా చేసేస్తున్నారు. ప్రాణాలు పోతాయని కూడా చూసుకోవటంలేదు. షోటో షూట్ ల కోసం చేసే ఫీట్లతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
?No, no and NO.
Level crossings are not the place for a photo shoot! ?❌
If you’re taking exercise, please take extra care at level crossings. Remind children to stay safe and set a good example.
✋??ALWAYS stop, look and listen. ?
#CrossWithCare #LevelCrossings pic.twitter.com/43RSyXGhyb
— Network Rail (@networkrail) January 22, 2021