A tearful tribute to Ramoji Rao on the set of Game Changer
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఈ నెల 5న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
రామోజీ మరణం పట్ల మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సంతాపం తెలియజేశారు. అశ్రు నివాళులు అర్పించారు. రామోజీరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని అన్నారు. చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. చరణ్తో పాటు దర్శకుడు శంకర్, నటులు సునీల్ రఘు కారుమంచి ఇతర చిత్ర బృంద సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
Ramoji Rao : రామోజీరావు కన్నుమూత.. సినీ ప్రముఖుల సంతాపం.. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది
గేమ్ ఛేంజర్ చిత్రీకరణలో రామోజీ రావు గారికి అశ్రు నివాళ్లు అర్పించిన రామ్ చరణ్ – దర్శకుడు శంకర్#GameChanger #Ramcharan pic.twitter.com/apNlDS1uIx
— Suresh PRO (@SureshPRO_) June 8, 2024