Ramoji Rao : రామోజీరావు క‌న్నుమూత‌.. సినీ ప్ర‌ముఖుల సంతాపం.. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది

రామోజీరావు మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Ramoji Rao : రామోజీరావు క‌న్నుమూత‌.. సినీ ప్ర‌ముఖుల సంతాపం.. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది

Celebrities condoles death of Ramoji Rao

Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న నానక్ రామ్‌గూడ‌లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయ‌న భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ సిటీకి తరలించారు. తెలంగాణ ప్ర‌భుత్వం రామోజీరావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.

రామోజీరావు మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

‘ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివి కేగింది. ఓం శాంతి.’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

‘రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ అని ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు.