Aadi Sai Kumar : శంభాలా సక్సెస్ తర్వాత మరో కొత్త సినిమా ప్రకటించిన హీరో ఆది సాయి కుమార్..
తెలుగు, తమిళ్ లో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. (Aadi Sai Kumar)
- Saketh U
- Published On : March 19, 2026 / 07:19 PM IST
Ego Raja
Aadi Sai Kumar : ఇటీవలే శంబాలా సినిమాతో భారీ సక్సెస్ కొట్టాడు ఆది సాయి కుమార్. తాజాగా మరో కొత్త సినిమా ప్రకటించాడు. ఎస్జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జి.సురేష్ నిర్మాణంలో గురు శరవణన్ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఈగో రాజా’. ఈ సినిమాలో ఆదితో పాటుగా నటుడు సతీష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ్ లో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
నేడు ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఆది సాయి కుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. చుట్టూ రౌడీలు, ఒంటిపై గాయాలు, రక్తం మరకలు చూస్తుంటే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు ఉండేట్టుగానే కనిపిస్తున్నాయి.
Also See : Kushitha Kallapu : పండగ పూట పద్దతిగా.. హాఫ్ శారీలో కుషిత కళ్లపు.. ఎంత ముద్దుగా ఉందో..
కె. ఎస్. రవికుమార్ వద్ద పనిచేసిన దర్శకుడు గురు శరవణన్ ‘కూగల్ కుట్టప్ప’తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తన మూడో సినిమాగా ఈగో రాజాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఆది తమిళ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
ego raja
