Alekhya Tarakratna
Alekhya Tarakratna : నందమూరి తారకరత్న 2023 ఫిబ్రవరిలో మరణించారు. ఆయన మరణం తర్వాత తారకరత్న భార్య అలేఖ్య అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తారకరత్న గురించి, తన పిల్లల గురించి పోస్టులు చేస్తుంది. తారకరత్న మరణం తర్వాత బయటకు రాని అలేఖ్య మొదటిసారి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూలో అలేఖ్య అనేక విషయాలు మాట్లాడింది. వీరి ప్రేమని తారకరత్న పేరెంట్స్ ఒప్పుకోలేదని అందరికి తెలిసిందే. ఆ విషయంపై కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
Also Read : Alekhya Tarakaratna : అప్పట్లో తారక్ ని వద్దన్నాను.. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీపై అలేఖ్య కామెంట్స్..
అలేఖ్య మాట్లాడుతూ.. తారక్ ని మొదట హైదరాబాద్ లోనే కలిసాను. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన అందర్నీ మన అని కలుపుకుంటారు. అప్పటికే నేను డైవర్స్ తీసుకున్నాను ఫస్ట్ మ్యారేజ్ నుంచి. నేను అసలు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా కానీ అతను కన్విన్స్ చేసాడు. నాన్నకు తారక్ ముందే తెలుసు. తననే వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడమన్నాను. ముందు ఒప్పుకోకపోయినా ఒక నెలరోజులకు ఓకే అన్నారు. మా పేరెంట్స్ ఒప్పుకున్నా వాళ్ళ సైడ్ ఒప్పుకోలేదు. అది మేము ఊహించలేదు.
నేను మా మామయ్య , అత్తమ్మ అని యాక్సెప్ట్ చేశాను కానీ వాళ్ళు ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. పెద్దవాళ్ళు కదా అలాగే ఉంటుంది. నా మీద కోపం ఉంటుంది వాళ్లకు. ఏదో ఒకరోజు పిల్లల్ని దగ్గరకు తీసుకుంటారు అనుకుంటున్నాను. నేను చాలా సార్లు వాళ్లకు దగ్గరవ్వాలని ప్రయత్నించాను. నేను పాజిటివ్ గానే ఉన్నాను. నేను ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఎవరితో కాంటాక్ట్ లో లేను. ఒకప్పుడు కళ్యాణ్ అన్న ఫ్రెండ్ లా ఉండేవాడు. ఒక్క బాల బాబాయ్ మాత్రం ఉంటారు మా కోసం. ఆయనకు మా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుంది. నాకున్నదాంట్లో నేను పిల్లలని పెంచగలను కానీ తారక్ పేరెంట్స్ కూడా వాళ్ళని దగ్గరకు తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అదొక్కటే నా కోరిక అని చెప్తూ ఎమోషనల్ అయింది.
Also Read : Trisha : విజయ్ ఎలాంటోడో గతంలోనే చెప్పిన త్రిష.. ఏం చెప్పిందో తెలుసా?