Amala Paul : భర్త, కొడుకుతో ఫస్ట్ మీట్ యానివర్సరీ చేసుకున్న అమలాపాల్.. ఫోటోలు వైరల్..
తాజాగా వీరి ఫస్ట్ మీట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు అమలాపాల్, జగత్ దేశాయ్.
- Saketh U
- Published On : August 13, 2024 / 05:17 PM IST
Amala Paul Jagat Desai Celebrated their First Meet Anniversary with their Son Photos goes Viral
Amala Paul : హీరోయిన్ అమలాపాల్ గత సంవత్సరం జగత్ దేశాయ్ అనే బిజినెస్ మెన్ ని ప్రేమించినట్టు తెలిపి రెండో పెళ్లి చేసుకుంది. వెంటనే తన ప్రగ్నెన్సీ కూడా ప్రకటించింది. ఇటీవల జూన్ లో వీరికి ఒక కొడుకు కూడా పుట్టారు. గత సంవత్సరం నవంబర్ లో వీరు పెళ్లి చేసుకున్నారు. అమలాపాల్ కి ప్రగ్నెన్సీ వచ్చాక పెళ్లి చేసుకుందని కొన్ని రూమర్స్ ఆ సమయంలో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : GV Prakash Kumar : హ్యారీపోటర్ లాంటి సినిమాతో GV ప్రకాష్.. ఏకంగా మూడు భాగాలుగా..
అయితే తాజాగా వీరి ఫస్ట్ మీట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు అమలాపాల్, జగత్ దేశాయ్. వీరిద్దరూ గత సంవత్సరం ఆగస్టు 11న మొదటిసారి కలుసుకున్నారని, అలాగే తన కొడుకు పుట్టి కరెక్ట్ గా రెండు నెలలు అయిందని ఇటీవల ఆగస్టు 11న కొచ్చిలో ఈ జంట సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అమలాపాల్, జగత్ దేశాయ్, వీరి కొడుకు ఇలై కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి అమలాపాల్ ఈ విషయం తెలిపింది. దీంతో పలువురు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
