Rajamouli : స్విస్ ఫిలిం ఫెస్టివల్‌లో బాహుబలి క్రేజ్.. రాజమౌళిని ట్యాగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుడు చేసిన పోస్ట్ వైరల్!

న్యూచాటెల్‌ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్‌లో (NIFFF) బాహుబలి క్రేజ్ మాములుగా లేదు. ఇన్నాళ్ల తరువాత కూడా బాహుబలి గురించి ఇంటర్నేషనల్ ఆడియన్స్..

Anurag Kashyap post to Rajamouli about Baahubali craze at NIFFF

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి (Baahubali) ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ప్రభావంతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక ఆ మూవీ చూసిన ఆడియన్స్ కూడా ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు. అదికూడా కేవలం ఇండియన్ ఆడియన్స్ మాత్రం కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా బాహుబలిని ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నారు. ప్రస్తుతం స్విజర్లాండ్ న్యూచాటెల్‌లో ‘న్యూచాటెల్‌ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్’ (NIFFF) జరుగుతుంది.

Yatra 2 : యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్.. రిలీజ్ డేట్ కూడా ఖరారు..

ఈ ఫెస్టివల్ కి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) హాజరయ్యాడు. ఇక ఆ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపిక చేసిన సినిమాలను ప్రదర్శిస్తున్న సమయంలో ఆడియన్స్ లో కొంతమంది ‘బాహుబలి’ అని అరుస్తున్నారు. మొదటిగా ఒక సినిమా ప్రదర్శించే ముందు యాడ్ ప్లే చేశారు. ఆ సమయంలో ఆడియన్స్ నుంచి బాహుబలి అని అరిచారు. అయితే అది ఒక్కసారితో అయ్యిపోలేదు. రెండు సారి కూడా అదే జరిగింది. అలా మరో మూవీ ప్లే చేసే ముందు యాడ్ వచ్చిన ప్రతి సారి ఆడియన్స్ బాహుబలి అని అరుస్తున్నారు. దీంతో ఆ విషయాన్ని అనురాగ్ కశ్యప్ 4 సార్లు వీడియో తీసి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి రాజమౌళి ని ట్యాగ్ చేశాడు.

Rakesh Master : రాకేశ్ మాస్టర్ మూడో భార్యపై దాడి.. నడిరోడ్డుపై చితక్కొట్టిన ఐదుగురు మహిళలు..

“రాజమౌళి అండ్ ఆయన సినిమా పై ఇక్కడ చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఆయన గనుక ఒక్కసారి ఇక్కడికి వస్తే అందరూ ఎంతో ఆనంద పడతారు. రాజమౌళి మీరు నిజమైన రాక్ స్టార్” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ కి రాజమౌళి రియాక్ట్ అవుతూ.. అనురాగ్ కశ్యప్ కి థాంక్యూ చెప్పాడు. ఇక ఇన్నాళ్ల తరువాత కూడా బాహుబలి గురించి ఇంటర్నేషనల్ ఆడియన్స్ మాట్లాతుండడంతో ప్రభాస్ అభిమానులు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు