Anushka Shetty Comments on Prabhas Food in Miss Shetty Mr Polishetty Movie Promotions comments goes Viral
Anushka Shetty : నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), అనుష్క శెట్టి(Anushka) కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. స్వీటీని వెండితెరపై చూసి దాదాపు 4 ఏళ్ళు పైనే అవుతుంది. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రమోషన్స్ లో కూడా అనుష్క కనిపించకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
తాజాగా అనుష్క కొంతమంది ప్రెస్ తో ఈ సినిమా గురించి చర్చించింది. ఈ ఇంటర్వ్యూలో అనుష్క పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. ప్రభాస్ గురించి కూడా మాట్లాడింది. తాను ప్రభాస్ దాదాపు 15 ఏళ్ళ నుంచి తెలుసని, మళ్ళీ మంచి స్క్రిప్ట్ వస్తే కచ్చితంగా ప్రభాస్(Prabhas) తో సినిమా చేస్తాను అని తెలిపింది.
ఇక ప్రభాస్ ఫుడ్ గురించి అందరికి తెలిసిందే. ప్రభాస్ మంచి ఫుడీ. బాగా తింటాడు. అలాగే అందరికి బాగా పెడతాడు. ప్రభాస్ ఇంటికి వెళ్లినా, ప్రభాస్ షూటింగ్ కి వెళ్లినా ప్రభాస్ స్పెషల్ ఫుడ్ తినాల్సిందే. చాలు అనేంతవరకు ప్రభాస్ ఫుడ్ పెడతాడు. ఇప్పటికే ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి, ప్రభాస్ బాగా తింటాడని అనేక మంది హీరోయిన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా అనుష్క మరోసారి ప్రభాస్ ఫుడ్ గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా మిర్చి సినిమా సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంది.
అనుష్క మాట్లాడుతూ.. ప్రభాస్ మంచి ఫుడీ అని అందరికి తెలిసిందే. మిర్చి సమయంలో మేము ఎక్కువ క్లోజ్ అయ్యాము. అప్పుడు అందరం కలిసి టిఫిన్ చేసే వాళ్ళం. ప్రభాస్, నిర్మాత ప్రమోద్ కూడా ఉండేవాడు. టిఫిన్ కే చాలా రకాలు ఉండేవి. టిఫిన్ కే భారీగా ఖర్చు పెట్టేవాళ్ళు. ఓ పక్కన టిఫిన్ చేస్తూనే మధ్యాహ్నం లంచ్ గురించి, లంచ్ లో ఏం తినాలి అను మాట్లాడుకునేవాళ్ళు. అది చూసి నేను ఆశ్చర్యపోయేదాన్ని. ప్రభాస్, ప్రమోద్ లతో కలిసి తినడం మొదలు పెడితే ఫుడీస్ కూడా తినడం మానేయాల్సిందే. వాళ్ళు అంత బాగా తింటారు అని చెప్పింది. దీంతో అనుష్క ప్రభాస్ ఫుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.