Arjun Sarja: ఫేక్ కలెక్షన్స్ వేసి మోసం చేయలేను.. అర్జున్ సర్జా సంచలన కామెంట్స్.. నెటిజన్స్ ఫిదా
మూవీ మార్కెటింగ్ ఏజెన్సీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో అర్జున్ సర్జా(Arjun Sarja).
- V Santhosh Kumar
- Published on- June 2, 2026 / 02:19 PM IST
Mrunal Thakur shares special photos from May month
- అర్జున్ సర్జా నిజాయితీ ప్రశంసలు.
- ఫేక్ కలెక్షన్ల పోస్టర్ తిరస్కరణ.
- మార్కెటింగ్ ఏజెన్సీపై యాక్షన్ కింగ్ మండిపాటు.
Arjun Sarja: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన స్వీయ దర్శకత్వంలో, సొంత నిర్మాణ సంస్థ శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తాజా చిత్రం ‘సీతా పయనం’. ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను సాధించింది. థియేటర్ రన్ ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Mrunal Thakur: మే నెల జ్ఞాపకాలు.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన మృణాల్ ఠాకూర్
అయితే ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని అర్జున్ సర్జా(Arjun Sarja) ఇటీవల మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమా ప్రమోషన్స్ బాధ్యతలు చూసే ఒక మార్కెటింగ్ ఏజెన్సీ, సినిమా క్రేజ్ పెంచడం కోసం కేవలం నాలుగు రోజుల్లోనే ₹4 కోట్లు వసూలు చేసినట్లు ఒక తప్పుడు పోస్టర్ను విడుదల చేద్దామని ఆయనకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన విన్న అర్జున్ ఆ ఏజెన్సీపై తీవ్రంగా మండిపడ్డారు. తనకు రాని డబ్బును వచ్చినట్లు చూపిస్తూ అబద్ధపు వసూళ్లతో కూడిన ఫేక్ పోస్టర్లను ఎలా వేస్తామని వారిని గద్దించారు.
ప్రస్తుత సినిమా రంగంలో కలెక్షన్ల కోసమని భారీ నంబర్లతో ఫేక్ పోస్టర్లు వేయడం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి రోజుల్లో సినిమా హిట్ కాకపోయినా లాభాల కోసం అబద్ధాలు చెప్పడానికి నిరాకరించి, అర్జున్ సర్జా ఇంత నిజాయితీగా వ్యవహరించడం విశేషం. చిత్ర పరిశ్రమలో విలువలను కాపాడుతూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు మరియు సినీ విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
