Brahmaji : సమంత, నాగ చైతన్యలు విడిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నా రోజూ ఎక్కడో ఒక చోట వాళ్ళ పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరో ఒకరు వాళ్ళ గురించి అడగడం, వాళ్ళ గురించి మాట్లాడటం చేస్తూనే ఉన్నారు. సమంత నాగ్ చైతన్య ఎపిసోడ్ ప్రతి రోజు హాట్ టాపిక్ గానే ఉంటుంది. వాళ్ళ గురించి ఏ చిన్న న్యూస్ బయటకి వచ్చినా ఫ్యాన్స్ దాన్ని తెగ వైరల్ చేసేస్తున్నారు. తాజాగా ఆర్టిస్ట్ బ్రహ్మాజీ సమంత, నాగ చైతన్య విడాకులపై తాజాగా స్పందించారు. సమంతపై వచ్చిన ట్రోల్స్ మీద సీరియస్ అయ్యాడు బ్రహ్మాజీ.
ఇటీవల బ్రహ్మాజీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”నేను సాధారణంగా అన్ని విషయాల్లో దూరను. కానీ మాట్లాడాల్సిన సమయంలో కచ్చితంగా మాట్లాడతాను. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నప్పుడు ఓ వ్యక్తి సమంతపై ఇష్టమొచ్చిన కామెంట్లు చేశాడు. నాగచైతన్య దగ్గర రూ.250 కోట్లు భరణం తీసుకుందని, గేమ్ ప్లే చేసిందని, నువ్వో సెకండ్ హ్యాండ్ అంటూ చీప్గా మాట్లాడాడు. సమంత కూడా ఆ కామెంట్స్ కి రిప్లై ఇచ్చింది. కానీ అతడి మాటలకి నాకు కూడా కోపం వచ్చింది.”
”ఈ విషయంపై నేను అతనితో మాట్లాడాను. నీకు అసలు సిగ్గు, శరం లేదు. నువ్వు థర్డ్ గ్రేడ్. ఆ అమ్మాయి వ్యక్తిగత విషయాలకు, నీకు సంబంధం ఏంటి?. సమంత ముఖం చూడాలన్నా, ఆమెతో మాట్లాడాలన్నా దాదాపు పదేళ్లు పడుతుంది. కానీ సోషల్ మీడియా వల్ల కనీసం ఆమెతో నీకు మాట్లాడే అవకాశం వచ్చింది, దానికి సంతోషపడాలి. ఆ అమ్మాయిని పొగుడు, ఆమె యాక్టింగ్ నచ్చకపోతే చెప్పు. అంతే కానీ ఆమె వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేందుకు నువ్వెవరు? అని అతని మీద సీరియస్ అయ్యాను” అని అన్నారు.