Bigg Boss 7 Day 30 : పవరాస్త్రలు లాగేసుకున్న బిగ్‌బాస్.. కెప్టెన్సీ టాస్కులు షురూ..

మంగళవారం ఎపిసోడ్ లో బిగ్‌బాస్ అందరికి షాక్ ఇచ్చాడు. మొదటగా ముగ్గురి దగ్గర్నుంచి పవరాస్త్రలను తీసేసుకున్నాడు. దీంతో వాళ్ళు అవాక్కవ్వగా మిగిలిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు.

Bigg Boss 7 Day 30 Highlights Captaincy Tasks Started

Bigg Boss 7 Day 30 : సోమవారం నాడు నామినేషన్స్ గొడవ అయిపోయింది. పవరాస్త్ర ఉన్న ముగ్గురు తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు ఈ వారం. అయితే మంగళవారం ఎపిసోడ్ లో బిగ్‌బాస్ అందరికి షాక్ ఇచ్చాడు. మొదటగా ముగ్గురి దగ్గర్నుంచి పవరాస్త్రలను తీసేసుకున్నాడు. దీంతో వాళ్ళు అవాక్కవ్వగా మిగిలిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు.

అనంతరం ఈసారి కెప్టెన్సీ టాస్కులు మొదలవుతాయని, అందులో గెలిచిన వాళ్లకి కెప్టెన్సీతో పాటు ఈ వారం, వచ్చే వారం కూడా నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. మొదట ఒక టాస్క్ ఇవ్వగా దానికి హౌస్ లో ఉన్న వాళ్ళు జంటలు జంటలుగా ఆడాలి. ఆ జంటల్ని మీరే సెట్ చేసుకోండి అని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో గౌతమ్ – శుభశ్రీ ఒక జంటగా, శివాజీ -ప్రశాంత్ ఒక జంటగా, అమర్ దీప్ – సందీప్ ఒక జంటగా, ప్రియాంక – శోభాశెట్టి ఒక జంటగా, యావర్ – తేజ ఒక జంటగా సెట్ అయ్యారు.

అనంతరం బిగ్‌బాస్ వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. ఒక స్మైల్ బొమ్మకి పళ్ళు లేకుండా ఇచ్చాడు. ఆ పళ్ళు అక్కడే కింద కలర్ వాటర్, దూది, థర్మోకోల్ బాల్స్ వేసి, వాటిలో పెట్టాడు. అన్ని జంటలకి సపరేట్ గా స్మైల్ బొమ్మలు ఇచ్చాడు. ఆ దూదిలో నంబర్స్ ఉన్న పళ్ళు ఏరుకొచ్చి ఆర్డర్ లో పెట్టాలి. అయితే ఆ దూది మీద తాళ్లు కట్టేయడంతో, ఆ తాళ్ల కింద నుంచి పాకుతూ వెళ్ళాలి. ఎవరైతే ఆ దూదిలో పళ్ళు కలెక్ట్ చేసి మొదట స్మైలీ బొమ్మకు పెట్టి ఇచ్చిన టైంలో గంట కొడతారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పాడు బిగ్‌బాస్.

Also Read : Bigg Boss 7 Day 29 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నదెవరు? బిగ్‌బాస్ కూడా తొండాట ఆడుతున్నడని శివాజీ ఫైర్..

అయితే ఈ టాస్క్ లో మొదట శివాజీ – ప్రశాంత్ బెల్ కొట్టినా వాళ్ళు నంబర్స్ తప్పు పెట్టారు. తర్వాత అమర్ దీప్ – సందీప్ పూర్తి చేయకముందే బెల్ కొట్టారు. ఆ తర్వాత శోభా -ప్రియాంక, శుభశ్రీ – గౌతమ్ పెట్టారు. చివరగా బజర్ మోగిన తర్వాత యావర్ – తేజ టాస్కుని పూర్తి చేసారు. అయితే వెళ్లలోంచే యావర్, శోభా శెట్టిలని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాలని బిగ్‌బాస్ చెప్పడంతో అందరూ సరిగ్గా పూర్తి చేయకపోవడంతో ఎవరికి ఇవ్వాలో అర్థంకాక చాలా సేపు చర్చించుకున్నారు. చివరగా గౌతమ్ – శుభశ్రీ మొదటి స్థానం, అమర్ దీప్ – సందీప్ రెండో స్థానం, మూడో స్థానం శివాజీ – ప్రశాంత్, నాలుగో స్థానం శోభా – ప్రియాంక అని చెప్పడంతో ప్రియాంక ఒప్పుకోకుండా గొడవకి దిగింది. దీంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. మరి వీరిలో నుంచి ఎవరు కెప్టెన్ అవుతారో నేడు చూడాలి.

ట్రెండింగ్ వార్తలు