Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో లెక్కలేనన్ని రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ అనేక సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించి కలెక్షన్స్ వర్షం కురిపించి రికార్డ్స్ తిరగరాసారు. ఇప్పుడు మరో సరికొత్త రికార్డ్ చిరంజీవి పేరిట నిలిచింది.(Chiranjeevi)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఇటీవల సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. చాలా రోజులు ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో నడిచింది. మెగాస్టార్ మ్యాజిక్ చాన్నాళ్ల తర్వాత కనిపించడంతో ఇంకేముంది కలెక్షన్ల వర్షం కురిసింది.
Also Read : Liam Crowley : జై బాబు అన్న హాలీవుడ్ రిపోర్టర్.. వారణాసి టీమ్ ని ఇంటర్వ్యూ చేసిన ఇతను ఎవరో తెలుసా?
మన శంకర వరప్రసాద్ గారు సినిమా మొదటి రోజే ఏకంగా 84 కోట్ల గ్రాస్ వసూలు చేసి చిరు కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఏడు రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతి సీజన్ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. దీంతో సంక్రాంతి హిట్ సినిమాలు ఇంకా థియేటర్ లో నడుస్తున్నాయి.
మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజయి 25 రోజులు పూర్తవగా తాజాగా ఇప్పటివరకు ఈ సినిమా 375 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో టాలీవుడ్ లో రీజనల్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు నిలిచింది. బాహుబలి, పుష్ప.. పలు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి కలెక్షన్స్ కొల్లగొడితే మన శంకర వరప్రసాద్ గారు కేవలం తెలుగులోనే రిలీజయి ఏకంగా 375 కోట్లతో టాలీవుడ్ రీజనల్ రికార్డ్ సెట్ చేసింది.
Also See : Vithika Sheru : భర్త వరుణ్ సందేశ్ తో కలిసి నటి వితిక షేరు బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
మొన్నటి వరకు ఈ రికార్డ్ 303 కోట్లతో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా పేరు మీద ఉండగా ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు దాన్ని బద్దలు కొట్టింది. ఈ సినిమాకు 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. హిట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 240 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. దానిని మించి 130 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి, నిర్మాతలకు ఫుల్ ప్రాఫిట్స్ వచ్చాయని టాలీవుడ్ సమాచారం.