Chiranjeevi: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడంతో, ఆమె అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలు ఆమెకు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఆమె ఈ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు. సమంత కోలుకోవాలని కోరినవారిలో టాలీవుడ్ స్టార్స్ నాని, తారక్, బండ్ల గణేష్, థమన్ వంటి వారు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు.
Samantha: సమంత త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీల ట్వీట్ల వర్షం!
ఆయన తాజాగా సమంత ఆరోగ్యం గురించి తెలుసుకుని, తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమె త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చిరు.. ‘‘సమయం మారుతున్నకొద్దీ మన జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి. మనలోని శక్తిని బయటపెట్టేందుకు ఇవి వస్తాయి. నువ్వు చాలా మంచి అమ్మాయివి.. నీలో ఉన్న శక్తి అద్భుతమైనది. నువ్వు ఈ ఛాలెంజ్ను ఖచ్చితంగా నెగ్గుకొస్తావని నాకు నమ్మకం. నువ్వు ధైర్యంగా, పట్టుదలతో ఉండాలని కోరుతున్నాను..’’ అంటూ పోస్ట్ చేశాడు.
Samantha: సమంతకు ఆ సీరియస్ జబ్బు.. త్వరలోనే కోలుకుంటానని ప్రకటన
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ స్టార్ హీరోయిన్కు అనారోగ్య పరిస్థితి ఏర్పడంతో ఆమెను చిరు ఓదార్చిన తీరు బాగుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక చిరు చేసిన ట్వీట్కు సమంత కూడా థ్యాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చింది.
Wishing you speedy recovery!!@Samanthaprabhu2 pic.twitter.com/ZWGUv767VD
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 30, 2022
Thankyou sir for your kind and encouraging words ?@KChiruTweets https://t.co/d10X8iYkdB
— Samantha (@Samanthaprabhu2) October 30, 2022