Evaru Meelo Koteeswarulu: హాట్ సీట్ లో దేవిశ్రీ, థమన్.. ఫన్ విత్ బ్రిలియంట్!

సిల్వర్ స్క్రీన్ నుండి బుల్లితెర వరకు తనను తానేంటో చూపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎన్టీఆర్ హోస్ట్..

Evaru Meelo Koteeswarulu: సిల్వర్ స్క్రీన్ నుండి బుల్లితెర వరకు తనను తానేంటో చూపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి వరుసగా టాప్ స్టార్స్ క్యూ కడుతున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ క్రేజీ మల్టీస్టారర్ కోసం మూడేళ్ళగా తనతో కలిసి ట్రావెల్ చేస్తున్న చరణ్ తోనే లాంచింగ్ ఈవెంట్ చేసిన తారక్ తనకి అత్యంత సన్నిహితులైన దర్శకులు రాజమౌళి, కొరటాల శివలను కూడా తీసుకొచ్చాడు.

Raja Vikramarka: కార్తికేయకి అండగా నాని.. ట్రైలర్ ముహూర్తం ఫిక్స్!

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ తో ఓ ఎపిసోడ్ కూడా షూటింగ్ పూర్తి చేసుకొని సరైన టైం కోసం వేచి ఉంది. కాగా, ఇప్పుడు ఈ దీపావళికి ప్రత్యేకంగా సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా రాణిస్తున్న దేవిశ్రీ ప్రసాద్, థమన్ లం తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా.. ప్రోమో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ కార్యక్రమంపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు.

AHA 2.0: ఇది ఆరంభం మాత్రమే.. ఐకాన్ స్టార్ సమక్షంలో ఆహా సెలబ్రేషన్స్

తన కెరీర్ లో చాలా ఎక్కువ సేపు షూట్ జరిగిన ఎపిసోడ్ గా తారక్ షో ఉంటుందని చెప్పిన థమన్.. చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ ఎపిసొడ్ అంటూ చెప్పుకొచ్చాడు. తారక్ అన్న చాలా బ్రిలియంట్ అని, దేవి శ్రీ ప్రసాద్ లతో క్రేజీ సమయం గడిపానని థమన్ చెప్పుకొచ్చాడు. ఈ ఎపిసొడ్ ఈ దీపావళి పండగ రోజున రాత్రి 8:30 గంటలకు ప్రసారం కానుంది.

ట్రెండింగ్ వార్తలు