Pawan Kalyan – Harish Shankar : పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ అవ్వడం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం అవ్వడంతో చేతిలో ఉన్న మూడు సినిమాలు పక్కనపెట్టేశారు. కుదిరినప్పుడు ఆ సినిమాలు పూర్తి చేస్తానని ఇటీవల పవన్ ఓ మీటింగ్ లో చెప్పారు. ఫ్యాన్స్ మాత్రం త్వరగా ఆ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. OG సినిమాకు రెండు వారాల డేట్స్ ఇస్తే షూట్ అయిపోతుంది. దీంతో మొదట OG సినిమాకే డేట్స్ ఇవ్వనున్నారు.
తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మాట్లాడారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు.
Also Read : Toxic : యశ్ ‘టాక్సిక్’ నుంచి సూపర్ అప్డేట్.. ఇక అభిమానులకు పండగే..
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అవ్వడంతో సినిమాలకు కుదరట్లేదు. మొన్నే ఆయన్ని మైత్రీ నిర్మాతలు కలిశారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయడానికి పవన్ ట్రై చేస్తానని తెలిపారు. ముందు OG, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్స్ జరుగుతాయి. వాటికి కొన్ని డేట్స్ ఇస్తే సరిపోద్ది. ఆ రెండు సినిమాలు అయ్యాకే నా సినిమా ఉంటుంది. ఆయన ఎప్పుడు డేట్స్ ఇచ్చినా నేను చేస్తాను. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 20 శాతం షూటింగ్ అయింది అని తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉండదు. ఆ ప్రాజెక్టు క్లోజ్ అయిపోయినట్టే అని వార్తలు వచ్చాయి. తాజాగా హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలతో ఆ సినిమా ఎంత లేట్ అయినా ఉంటుందని తెలుస్తుంది.
Confirmed :#UBS will be Released After #OG and #HHVM pic.twitter.com/QZrvmAPVSu
— Pawanism™ (@santhu_msd7) August 6, 2024