Allu Arjun: హైదరాబాద్ కి బై బై చెప్పనున్న ‘అల్లు అర్జున్’.. ఇక ముంబైలోనే మకాం
హైదరాబాద్ విడిచి ముంబైకి షిఫ్ట్ అవుతున్న అల్లు అర్జున్(Allu Arjun).
- V Santhosh Kumar
- Updated on- April 19, 2026 / 03:53 PM IST
icon star allu arjun permanently shifting to mumbai
- ఇక ముంబైలోనే అల్లు అర్జున్
- వరుసగా పాన్ ఇండియా లెవల్ ప్రాజెక్ట్స్
- అల్లు అరుజున్ ఫ్యాన్స్కి బాడ్ న్యూస్
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ‘పుష్ప 2’ సృష్టించిన ప్రభంజనంతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన ఆయన, తన నెక్స్ట్ సినిమాల కోసం చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడు. అందులో భాగాంగానే, ముంబైకి తన మాకంను మార్చనున్నాడని సమాచారం. రాబోయే రెండు మూడేళ్ల పాటు బాలీవుడ్ ప్రాజెక్టులు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ మీద దృష్టి సారించేందుకు ముంబైపై అయితేనే నీకు సెట్ అవుతుందని భావిస్తున్నాడట. అందుకే,ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ లైనప్లో క్రేజీ ప్రాజెక్టులు ఉండటంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.
Suyodhana OTT: సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన ‘సుయోధన’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వాటిలోతమిళ దర్శకుడు ట్లీ తో చేస్తున్నచేస్తున్న ‘రాకా’ (Raaka) సినిమా కూడా ఉంది. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు, మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోయే ‘AA23’ కూడా ఇంటర్నేషనల్ లెవల్లో రానుంది. ఈ చిత్రం అల్లు అర్జున్(Allu Arjun) మాస్ ఇమేజ్ను నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లేలా ఉంది. ఈ సినిమాల షూటింగ్స్ అధిక భాగం ముంబై పరిసరాల్లోనే ప్లాన్ చేశారు. అట్లీతో చేయబోయే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా బాలీవుడ్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూనే రూపొందుతోంది.
కుటుంబం హైదరాబాద్, ముంబై మధ్య ప్రయాణిస్తూ ఉండగా, బన్నీ మాత్రం పూర్తిగా తన పాన్-ఇండియా మార్కెట్ను పటిష్టం చేసుకోవడంలో బిజీగా ఉండనున్నారు. కేవలం తెలుగు హీరోగా మాత్రమే కాకుండా, భారతీయ సినిమా ప్రతినిధిగా ఎదిగేందుకు ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం టాలీవుడ్ స్థాయిని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ముంబై షిఫ్టింగ్ అనేది ఆయన కెరీర్లో ఒక భారీ మలుపు కానుంది.
