Yadamma Raju : పటాస్, జబర్దస్త్ షోలతో కమెడియన్ గా తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న నటుడు యాదమ్మ రాజు.. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలు చేస్తూ వస్తున్నారు. కాగా తాజాగా ఈ నటుడిని రాజకొండ కమీషనరేట్ పరిధిలోని బీబీనగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా నాల్ బెయిలబుల్ వారెంట్ పై అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
Also read : NTR : కొత్త కారు కొన్న ఎన్టీఆర్.. ఆ కారు విలువ ఎంతో తెలుసా..
యాదమ్మ రాజుని మరియు అతని స్నేహితుడు హరిని పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల కస్టడీకి తరలించారట. అయితే ఇదంతా ఓ సినిమా ప్రమోషన్ కోసమని తెలుస్తుంది. ప్రస్తుతం యాదమ్మ రాజు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగానే ఈ న్యూస్ ని వైరల్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ వార్తల్లో ఏం రాసుకొచ్చిన విషయం ఏంటంటే.. తన ఆస్తిని తాను సాధించుకోవడం కోసం యాదమ్మ రాజు తన స్నేహితుడితో వెంట్రుకలను సేకరిస్తున్నాడట.
ఈ పాయింట్ సినిమా స్టోరీ లైన్ తెలుస్తుంది. దీని గురించి వివరాలను త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అందరికి తెలియజేయనున్నారు. మరి ఇది సినిమా ప్రమోషన్..? లేదా మరి ఇంకేమైనా విషయమా..? అనేది తెలియాలంటే వేచి చూడాలి.