ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి కోరికను నెరవేర్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆయనే వెల్లడించారు. అమ్మ పుట్టిన రోజుకు కేవలం రెండు రోజుల ఇలా చేయడం ఆమెకు తానిచ్చిన అత్యుత్తమ బహుమతి అని పేర్కొన్నాడు.
ఇంతకి ఎన్టీఆర్ తల్లి శాలిని కోరిక ఏంటో తెలుసా..? తన కొడుకు ఎన్టీఆర్ను తన స్వగ్రామం తీసుకుని వెళ్లాలని, ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకోవాలని ఆమె కోరిక. ఈ రోజు ఆమె కోరిక నెరవేరింది. జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి శాలినితో కలిసి ఆమె స్వగ్రామమైన కుందాపురానికి వెళ్లారు. ఆ తరువాత ఉడిపి శ్రీకృష్ణ మఠాన్నిసందర్శించారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్నారు ఎన్టీఆర్. ‘నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలనే మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది! సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి.’అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు. వారి వెంట దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ హీరో రిషబ్ శెట్టి లు సైతం ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.