Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కి కర్ణాటక రాష్ట్ర అవార్డు.. అతిధులుగా ఎన్టీఆర్, రజినీకాంత్..

నవంబర్ 1న కర్ణాటక రత్న అవార్డుని కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకి అందచేయనున్నారు. ఈ మేరకు ఓ భారీ బహిరంగ సభని కూడా నిర్వహించనున్నారు. దీనికి అధిక సంఖ్యలో...............

Puneeth Rajkumar :  కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ గత సంవత్సరం గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కన్నడ ప్రజలకి, సినీ పరిశ్రమకి తీరని లోటుని మిగిల్చింది. హీరోగానే కాక ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకి దగ్గరయ్యారు పునీత్ రాజ్‌కుమార్‌. దీంతో ఆయన మరణం అక్కడి ప్రజలని ఎంతో కలవరపరిచింది. నేటికీ ఆయన సమాధి వద్దకు ఎంతోమంది ప్రజలు, ప్రముఖులు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు.

పునీత్ రాజ్‌కుమార్‌ మరణించినపుడు ఆ కార్యక్రమాలన్నీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి జరిపించింది. అలాగే పునీత్ రాజ్‌కుమార్‌ కి కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక అత్యుత్తమ అవార్డు ‘కర్ణాటక రత్న’ని ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకి ఈ అవార్డు అందచేస్తామని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం.

Empire Magazine : RRRకి మరో గుర్తింపు.. వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగజైన్ లో RRR సినిమా గురించి..

నవంబర్ 1న కర్ణాటక రత్న అవార్డుని కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకి అందచేయనున్నారు. ఈ మేరకు ఓ భారీ బహిరంగ సభని కూడా నిర్వహించనున్నారు. దీనికి అధిక సంఖ్యలో పునీత్ అభిమానులు హాజరు కానున్నారు. అయితే ఈ అవార్డుని అందచేసే కార్యక్రమానికి అతిధులుగా చాలా మంది సినీ ప్రముఖులు హాజరవనున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రజినీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రజినీకాంత్ కూడా రావొచ్చు అని కన్నడ మీడియా సమాచారం. దీంతో ఎన్టీఆర్, రజినీకాంత్ అభిమానులు కూడా ఈ సభకి భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్, పునీత్ మంచి స్నేహితులు. పునీత్ కోసం ఆయన సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడారు.

ట్రెండింగ్ వార్తలు