Lavanya Tripathi Konidela: సోషల్ మీడియా వేధింపులపై లావణ్య సీరియస్.. సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
సోషల్ మీడియా వేధింపులపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi Konidela).
- V Santhosh Kumar
- Published On : March 10, 2026 / 10:06 AM IST
Lavanya Tripathi files complaint with cybercrime police over social media harassment
Lavanya Tripathi Konidela: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నెగిటీవ్ కామెంట్స్, ట్రోలింగ్ ఎక్కువ అయిపోయింది. సినిమా స్టార్స్ పై ఇంకా ఎక్కువగా ప్రచారాలు జరుగుతున్నాయి. ట్రోలింగ్, అసభ్యకరమైన కామెంట్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా, మెగా కోడలు, నటి లావణ్య త్రిపాఠి కొణిదెల(Lavanya Tripathi Konidela) తనపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు హద్దులు దాటి కామెంట్స్ చేస్తున్నారని సైబర్క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Sahithi Dasari: ట్రెండీ లుక్స్ లో దాసరి సాహితి.. గ్లామర్ చూస్తే పోతుంది మతి.. ఫొటోలు
గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికలపై లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి కొందరు నెటిజన్లు అత్యంత జుగుప్సాకరమైన కామెంట్స్ చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. దాంతో, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న లావణ్య.. తనపై ట్రోలింగ్ మాత్రమే కాకుండా మార్ఫింగ్ ఫోటోలు, అసత్య ప్రచారాలను సర్క్యులేట్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లావణ్య త్రిపాఠి కొణిదెల ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వేధింపులకు పాల్పడుతున్న ఐడిలు, యూట్యూబ్ థంబ్నైల్స్, ఎక్స్ హ్యాండిల్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
