Guntur Kaaram : మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ని మొదలుపెట్టి.. ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఈక్రమంలోనే మొదటి సాంగ్ ‘దమ్ మసాలా’ని రిలీజ్ చేసి మాస్ దుమ్ము దులిపేశారు. తాజాగా సెకండ్ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ పాటకి థమన్ సంగీతం అందించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా శిల్పా రావు పాటని అద్భుతంగా పాడారు. కాగా ఈ సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉన్నాయట. మరో రెండు సాంగ్స్ ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది. మరో పదిహేను రోజుల్లో క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయి. మరి ఈ సెలబ్రేషన్స్ కి టీజర్ లాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తారా..? లేదా సాంగ్స్ నే రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.
Also read : Year End Roundup 2023: బ్యాచ్లర్ లైఫ్కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివారైన సినీ తారలు
కాగా గతంలో త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఆ చిత్రాలు మంచి ప్రేక్షాధారణ అందుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా వర్క్ అవుట్ లేదు. ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ ఈసారైనా ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందా లేదా చూడాలి. మేకర్స్ మాత్రం.. మహేష్ ని ఇప్పటివరకు చూడనంత మాస్ గా ఈ సినిమాలో చూస్తారంటూ చెబుతున్నారు. మరి జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.