Nagarjuna – Anshu Ambani : మళ్ళీ రీ యూనియన్ అయిన మన్మథుడు జంట.. ఫొటోలు వైరల్..

మళ్ళీ రీ యూనియన్ అయిన మన్మథుడు జంట. నాగార్జునని కలుసుకున్న హీరోయిన్ అన్షు అంబానీ.

Manmadhudu movie couple Nagarjuna Anshu Ambani re union photos gone viral

Nagarjuna – Anshu Ambani : నాగార్జున హీరోగా 22ఏళ్ళ క్రిందట టాలీవుడ్ లో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ స్టోరీ ‘మన్మథుడు’. సోనాలి బెంద్రే మెయిన్ హీరోయిన్ గా నటించగా, అన్షు అంబానీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ సినీ కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఫ్లాష్‌బ్యాక్ లో వచ్చే అన్షు, నాగ్ పెయిర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే ‘నేను నేనుగా లేనే’, ‘గుండెల్లో ఏముంది’ సాంగ్స్ అప్పటికి ఇప్పటికి చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

మొదటి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ ఆడియన్స్ లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు అన్షు. ఆ తరువాత ప్రభాస్ తో ‘రాఘవేంద్ర’, శివాజీ ‘మిస్సమ్మ’ సినిమాలో ఓ అతిథి పాత్ర, తమిళంలో హీరోయిన్ గా ఓ సినిమా చేసి కెరీర్ కి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. రాఘవేంద్ర షూటింగ్ సమయంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఉమెన్ గా మారిపోయి కుటుంబంతో లండన్ లో స్థిరపడ్డారు.

Also read : Anshu Ambani : ‘మన్మథుడు’ సమయంలో చాలా ఇబ్బందిని ఫేస్ చేశాను.. ఆయన వల్లే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాను..

అయితే ఇటీవల మన్మథుడు సినిమా రీ రిలీజైన తరువాత మళ్ళీ లైం లైట్ లోకి వచ్చారు. రీ రిలీజ్ సమయంలో అభిమానుల కోసం సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ రీ రిలీజ్ తో అన్షు పేరు మళ్ళీ టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది. అప్పుడు కొన్ని కారణాలు వల్ల సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయిన అన్షుకి.. ఇప్పుడు ఈ రీ రిలీజ్ తన రీ ఎంట్రీకి కరెక్ట్ సమయం అని భావించినట్లు తెలుస్తుంది.

మన్మథుడు రీ రిలీజ్ తరువాత హైదరాబాద్ తిరిగి వచ్చిన అన్షు వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా తన మొదటి హీరో నాగార్జునని కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పిక్స్ చూసిన ఆడియన్స్.. నాగార్జున కెరీర్‌లో హీరోయిన్ అన్షు బెస్ట్ పెయిర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ మళ్ళీ స్క్రీన్ పై కనిపిస్తుందేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు