మెగా ఫ్యామిలీకి మిస్టర్ బచ్చన్ టెన్షన్? నిజమేనా?

. పవన్ కల్యాణ్‌, చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

హరీశ్‌ శంకర్.. అగ్రెసివ్ డైరెక్టర్. ఆయన సినిమాలు మాస్‌కు కేరాఫ్‌గా ఉంటాయి. అయితే ఈ మధ్యే ఆయన డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్‌ మూవీ మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. సినిమా విడుదలకు ముందే డిజాస్టర్ అంటూ టాక్ బయటకు వచ్చేసింది. అంతేకాదు ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. మిస్టర్ బచ్చన్ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టిందన్న టాక్.. మెగా ఫ్యామిలీని టెన్షన్ పెడుతున్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా స్ర్పెడ్ అవుతుంది.

హరీశ్‌ శంకర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాడు. ఇది దాదాపు 20 శాతం సినిమా షూటింగ్ అయింది. అంతేకాదు మూవీ గ్లింప్స్ కూడా పవన్ కల్యాణ్‌ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. సినిమా మిగతా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో కూడా హరీశ్ శంకర్ సినిమా కమిట్ అయ్యాడు. చిరు డాటర్ సుష్మిత ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్టోరీ డిస్కషన్‌లో ఉంది.

మిస్టర్ బచ్చన్ అట్టర్ ప్లాప్ తర్వాత మెగా ఫ్యామిలీలో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. ఎందుకైనా మంచిది ఆపేస్తే పోలా అనుకుంటున్నారంటా. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఇప్పటికే ఆగినట్టు టాక్. కానీ మెగాస్టార్ చిరంజీవి మోహమాటం కొద్ది వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం కష్టమే అంటున్నారు ఫ్యాన్స్.

అందుకే హరీశ్ శంకర్‌తో సినిమాను పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌, చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక మిస్టర్ బచ్చన్‌లా ఉస్తాద్‌ భగత్ సింగ్ కూడా తమిళ్ మూవీ ‘తేరి ‘రిమేక్ సినిమా కావటంతో ఇంకా టెన్షన్ పడుతున్నారు.

Also Read: కొత్త బిజినెస్ మొదలు పెట్టిన సమంత.. చెన్నై ఫ్రాంచైజీకి పార్ట్నర్‌గా..

ట్రెండింగ్ వార్తలు