Pawan Kalyan comments on NTR and Prabhas in varahi yatra
Janasena Pawan Kalyan : జనసేన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల మొదలైన ఈ రాజకీయ ప్రచారంలో భాగంగా నిన్న (జూన్ 16) కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించాడు. ఈ యాత్రలో భారీగా యువకులు, పవన్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక పర్యటనలో పవన్ యువతని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan: నా రెండు చెప్పులు కొట్టేశారు, ఎవరో దొంగిలించారు: పవన్ కామెంట్స్
సినిమా వేరు, రాజకీయం వేరు అని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్.. సినిమా పరంగా రాష్ట్రంలోని యువత ఏ హీరోని అయినా ఇష్టపడడంలో తప్పులేదని, కానీ రాష్ట్ర ప్రయోజనాలు దగ్గరకి వచ్చేపాటికి యువత ఆలోచించాల్సి ఉంటుందని గుర్తు చేశాడు. తన తోటి నటీనటులు అంటే తనకెంతో గౌరవం ఉందని, వారి సినిమాలను కూడా చూస్తానని వెల్లడించిన పవన్.. రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (NTR), ప్రభాస్ (Prabhas), చిరంజీవి అంటే తనకి ఇష్టమని చెప్పుకొచ్చాడు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మూవీ పూర్తి చేయడానికి ఆయా సినిమా నిర్మాతలు పవన్ ఎక్కడ ఉంటే అక్కడ షూటింగ్స్ జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పవన్ వారాహి యాత్ర జూన్ నెలాఖరు వరకు సాగనుంది. ఇక మూవీ షూటింగ్స్ మళ్ళీ ఎప్పుడు మొదలు అవుతాయి అన్న అయితే క్లారిటీ లేదు.
Appeal to All Fandoms from Janasena Chief Pawan Kalyan.#VarahiVijayaYatra pic.twitter.com/XYKKEDT8zG
— Raees (@RaeesHere_) June 16, 2023