Pragya Jaiswal: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్బస్టర్ హిట్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్
మూవీ షూటింగ్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.. కొద్ది నెలల విరామం తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది.
ముందుగా బాలయ్య పక్కన సయేషా సైగల్ కథానాయికగా నటించనుందని ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు ఆమె ప్లేస్లో ప్రగ్యా జైస్వాల్ను తీసుకున్నారు. బాలయ్య పక్కన తను పిల్లలా కనిపిస్తుందనే కారణంతోనే వద్దనుకున్నారని తెలుస్తోంది. బోయపాటి ‘జయ జానకి నాయక’ లో ప్రగ్య ప్రత్యేకపాత్రలో కనిపించి ఆకట్టుకుంది. పూర్ణ, ప్రగ్య ఇద్దరూ బాలయ్యతో జతకడుతున్నారు.